News January 25, 2025
నాగర్కర్నూల్లో డేంజర్ ఫుడ్.!

జిల్లాల్లోని విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఇటీవల గద్వాలలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల11న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలో ఒకరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. GWL, WNP, NGKL జిల్లాల్లోని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు అమ్మే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త.!
Similar News
News November 28, 2025
ఏర్పేడు: రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్కు దరఖాస్తుల ఆహ్వానం

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్-01 పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/advt_712025/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 10.
News November 28, 2025
బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.


