News February 13, 2025
నాగర్కర్నూల్లో మహిళ దారుణ హత్య

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
Similar News
News October 18, 2025
తిరుపతి: దొంగలు అరెస్ట్.. రూ.25 లక్షల సొత్తు స్వాధీనం

తిరుపతి జిల్లాలో ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు నగలు దొంగిలించే ముగ్గురు మహిళా దొంగలను, ఇద్దరు మోటార్ సైకిల్ దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువచేసే 230 గ్రాముల బంగారు నగలు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీలు నాగభూషణరావు, రవి మనోహర్ ఆచారి వివరాలను మీడియాకు వెల్లడించారు.
News October 18, 2025
భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో బెస్ట్ అవార్డు

భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో ‘బెస్ట్ అవార్డు’ లభించింది. గ్రామాల అభివృద్ధిలో విశిష్ట సేవలను అందించినందుకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. విజన్ 2030లో భాగంగా 130 గిరిజన గ్రామాల అభివృద్ధి, ‘ఆది కర్మయోగి అభియాన్’ అమలులో ఐటీడీఏ అద్భుత పనితీరు చూపినందుకు ఈ గౌరవం దక్కిందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. ఈ అవార్డు రావడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
News October 18, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్హౌస్లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.