News March 29, 2025
నాగర్కర్నూల్: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యే

నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజ్నిపల్లి, తాడూరు మండలాలకు చెందిన CMRF, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 133 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే Dr.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.
Similar News
News December 16, 2025
హైదరాబాద్ BDLలో 80 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో 80 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్సైట్:bdl-india.in
News December 16, 2025
చమురు కుంభకోణం కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం

1996 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ జట్టు కెప్టెన్, శ్రీలంక మాజీ పెట్రోలియం మంత్రి అర్జున రణతుంగ చమురు స్కామ్ కేసులో చిక్కుకున్నారు. చమురు కొనుగోళ్ల విధానాన్ని మార్చి ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించారనే ఆరోపణలపై అవినీతి నిరోధక సంస్థ కేసు నమోదు చేసింది. ప్రభుత్వానికి సుమారు రూ.23.5 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న ఆయనను స్వదేశానికి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు.
News December 16, 2025
సంగారెడ్డి: అమ్మో చలి

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 12.2 డిగ్రీలు, గుమ్మడిదలలో 13.6 డిగ్రీలు, అమీన్పూర్లో 14.7° డిగ్రీలు, రామచంద్రాపురంలో 15.1 డిగ్రీలు, పటాన్ చెరులో 11.5° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 89.4%గా ఉంది. ఉదయం పూట చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను కాచుకుంటున్నారు.


