News March 24, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్

image

ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండ తీవ్రతకు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అచ్చంపేట మండలం అయినోలులో 40.7 డిగ్రీలు నమోదు కాగా, బిజినేపల్లి మండలంలో 40.5 నమోదయ్యాయి.

Similar News

News November 15, 2025

ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

image

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

News November 14, 2025

కురుమూర్తి స్వామి ఆలయంలో కోడెల వేలం

image

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన 18 కోడెదూడల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.1,17,000 ఆదాయం లభించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సభ్యులు భాస్కరాచారి, కమలాకర్ పాల్గొన్నారు.

News November 13, 2025

MBNR: U-14 క్రికెట్.. 150 మంది హాజరు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలురకు క్రికెట్ ఎంపికలు MDCA స్టేడియంలో నిర్వహించారు. SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనా వారిని ఈ నెల 15న నారాయణపేటలో జరిగే ఎంపికలలో పంపిస్తామన్నారు. పీడీలు వేణుగోపాల్, అబ్దుల్లా, మోహినుద్దీన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.