News April 2, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో చికిత్స పొందతూ ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గగ్గలపల్లికి చెందిన బాలమ్మ(60) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపం చెంది ఈనెల 25న పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది. అదే గగ్గలపల్లికి చెందిన మల్లమ్మ(45) కూతురి పెళ్లికావటంతో ఒంటరిగా ఫీలై అనారోగ్యంబారిన పడింది. మనస్తాపం చెంది ఈనెల 26న పురుగుమందు తాగగా, చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది.

Similar News

News October 19, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: అనకాపల్లి ఎస్‌ఐ

image

అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పిసినికాడ జాతీయ రహదారి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. మృతుని వయసు 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 19, 2025

MDK: ఈనెల 23 వరకు గడువు.. 27న డ్రా

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మెదక్ జిల్లాలో(49 షాపులు) 1,350, సిద్దిపేట(93)లో 2,518, సంగారెడ్డి(101)లో 4,012 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపుల డ్రా తీయనున్నట్లు చెప్పారు.

News October 19, 2025

HYD: సింగిల్స్‌ను టెంప్ట్ చేస్తున్నారు.. మోసపోకండి!

image

వాట్సప్‌నకు వచ్చే లింకులు, APKలతో జాగ్రత్త! సింగిల్స్‌ను టెంప్ట్ చేసేందుకు ఇటీవల కేటుగాళ్లు అశ్లీల వీడియోలు అంటూ APKఫైల్ పంపుతున్నారు. దీనిమీద క్లిక్ చేస్తే మెయిల్, గ్యాలరీ, పేమెంట్ యాప్స్ వాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని HYD సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల నగరంలోని ఓ వ్యక్తికి వాట్సప్‌లో ఈ ఫైల్ రాగా.. తన కొడుకుకి చూపిచడంతో వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేసి వాట్సప్‌నకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.