News April 6, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెంట్లవెల్లి వాసి గార్డుల లేవన్న(45) పనిమీద పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌కి వెళ్లాడు. తిరిగొస్తుండగా శనివారం రాత్రి కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్లో వెళ్లి బైక్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Similar News

News October 30, 2025

బంతి తగిలి యంగ్ క్రికెటర్ మృతి

image

ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్(17) ప్రాణాలు కోల్పోయాడు. మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బెన్ మెడకు బంతి బలంగా తాకడంతో చనిపోయాడు. అతడి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా పదకొండేళ్ల క్రితం ఆసీస్ బ్యాటర్ ఫిలిప్‌ హ్యూస్‌ కూడా బంతి తాకి ప్రాణాలు కోల్పోయారు.

News October 30, 2025

NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

image

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.

News October 30, 2025

ఆదిలాబాద్: పత్తిచెనులో పులి

image

భీంపూర్ మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరిస్తోందని స్థానికులు తెలియజేశారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీయడం జరిగిందన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు హైమద్ ఖాన్‌ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.