News April 16, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. ఇద్దరి మృతి 

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ నుంచి  చారకొండ మధ్యలో ఎర్రగుంటపల్లి వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించారు. మృతులు కార్తీక్ చారి సబ్ స్టేషన్‌లో పనిచేస్తుండగా అరవింద్ చారి బస్టాప్ వెనుక మీల్స్ హోటల్ నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

మహబూబ్ నగర్ నియోజకవర్గం మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. MBNR ఫస్ట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ శనివారం తెలిపారు.18 నుంచి 50 వయసు ఉండాలని 72079 88913, 72079 88914 సంప్రదించాలన్నారు.

News November 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 6 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in/

News November 8, 2025

వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – కలుపు నివారణ

image

వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తాక కలుపు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కిలో అట్రజిన్ 50% పొడి మందును కలిపి పంట విత్తిన 48 గంటలలోపు నేలంతా తడిచేట్లు పిచికారీ చేయాలి. వరి దుబ్బులు తిరిగి చిగురించకుండా 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. దీని వల్ల విత్తిన 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు రాదు. అట్రజిన్+పారాక్వాట్ కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.