News March 19, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో విషాదం.. మహిళ ఆత్మహత్య

ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిజినపల్లి వాసి బత్తుల లక్ష్మి(48) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించేసరికి ఇంట్లో మంటలు ఎగిసిపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సయ్యద్ అలీ తెలిపారు.
Similar News
News November 21, 2025
పల్నాడు: వీరాచారవంతులు అంటే ఎవరో తెలుసా.?

900 సంవత్సరాల పల్నాడు చరిత్ర, సంస్కృతిని కాపాడుతూ, నాటి సంస్కృతి గొప్పతనాన్ని నేటికీ ప్రచారం చేస్తున్నవారే వీరాచారవంతులు. వీరుల ఉత్సవాల సందర్భంగా దేశ నలుమూలన ఉన్న వీరాచారవంతులు కారంపూడికి వస్తారు. బ్రహ్మనాయుడు వారసులుగా ఉన్న పిడుగు వంశస్థులు వీర పీఠాన్ని నిర్వహిస్తున్నారు. వీరుల గాథలను, ఆయుధాల పరిరక్షణను, ఉత్సవాల నిర్వహణను వారసత్వంగా కొనసాగిస్తూ పల్నాటి చరిత్ర సంస్కృతిని నేటికీ నిలబెడుతున్నారు.
News November 21, 2025
పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణే కాక Herd Immunityని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
News November 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.


