News February 2, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తీవ్ర విషాదం

image

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 18, 2025

MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

image

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.

News November 18, 2025

MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

image

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.

News November 18, 2025

HYD: MTech విద్య వైపు పెరుగుతున్న ఆసక్తి!

image

HYDలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో MTechకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరోవైపు యూనివర్సిటీలలో PhD పట్టాలు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా ఎడ్యుకేషన్ సైట్ కన్జీవ్ తెలిపింది. MTech విద్యలో ఫ్యాకల్టీలో దాదాపు 70% వరకు PhDలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాలు పాటించేలా యూనివర్సిటీలో చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.