News February 2, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 12, 2025
ఇంద్రవెల్లి: మాజీ సర్పంచ్ మృతి

ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News February 12, 2025
పెద్దపల్లి: 3 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి: భూనిర్వాసితులు

పెద్దపల్లి- కూనారం ఆర్ఓబీ ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ విలువకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వాస్తవ మార్కెట్ ధర కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వాలని చూస్తోందని భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో తగిన న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
News February 12, 2025
ప్రధానికి బెదిరింపు కాల్

PM మోదీ టార్గెట్గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.