News February 2, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తీవ్ర విషాదం

image

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 12, 2025

అనంత: బీటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో డిసెంబర్‌, జనవరిలో నిర్వహించిన బీటెక్ 4-1, 4-2 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News February 12, 2025

ఎనుమాముల మార్కెట్ సెక్రటరీ సస్పెండ్

image

ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల సస్పెండ్‌కు గురయ్యారు. జిల్లా పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. మార్కెట్ సెక్రటరీ సస్పెండ్ హాట్ టాపిక్‌గా మారింది.

News February 12, 2025

సంజూ శాంసన్‌కు సర్జరీ పూర్తి

image

ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. ఆ వేలికి తాజాగా సర్జరీ పూర్తైందని క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. సర్జరీ నుంచి కోలుకునేందుకు ఆయనకు నెల రోజులు సమయం పట్టొచ్చని తెలిపింది. ఐపీఎల్ సమయానికి సంజూ ఫిట్‌గా ఉంటారని సమాచారం. కాగా.. ఈ సర్జరీ కారణంగా ఆయన కేరళ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యారు.

error: Content is protected !!