News March 31, 2025

నాగర్‌కర్నూల్: ఢిల్లీకి బయలుదేరిన కల్వకుర్తి నాయకులు

image

స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది బీసీ నాయకులు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి నుంచి నాయకులు వెళ్లారు. 

Similar News

News November 8, 2025

రామారెడ్డి: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

image

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాలిలా..రామారెడ్డి (M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ. 1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోస పోయినట్లు తెలిసి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.

News November 8, 2025

అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

image

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్‌ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్‌ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.

News November 8, 2025

కృష్ణా: అలర్ట్..పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా NOV 17లోపు, రూ. 200 ఫైన్‌తో NOV 19లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.