News April 4, 2025
నాగర్కర్నూల్: పెద్దపులి దాడి.. యజమానులకు నష్టపరిహారం

NGKL జిల్లా అచ్చంపేట ప్రాంతంలో రెండు నెలల క్రితం పెద్దపులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ నష్టపరిహారం అందజేసింది. బక్క లింగాయపల్లి, దండాలం గ్రామాలకు చెందిన హరి, వెంకట్రామ్, రాకేశ్కు వరుసగా రూ.15,000, రూ.15,000, రూ.12,000 చొప్పున చెక్కులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేంద్ర, అధికారులు బాలరాజు, జ్యోతి, రజిత తదితరులు ఉన్నారు.
Similar News
News November 19, 2025
ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్ అటాక్లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.
News November 19, 2025
నిర్మల్: ఈ నెల 21న U-14, 16 అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

జాతీయ స్థాయి అండర్-14, 16 బాలబాలికల శిక్షణ కోసం ఈ నెల 21న నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం గౌడ్ తెలిపారు. అండర్-14కు 21-12-2011 to 20-12-2013, అండర్-16కు 21-12-2009 to 20-12-2011 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 19, 2025
అనకాపల్లి: 2,42,480 మంది ఖాతాల్లో నగదు జమ

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ అయినట్లు జేసీ జాహ్నవి తెలిపారు. సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో జేసీ జాహ్నవి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఈ పథకం కింద నిధులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులకు చెక్కులను అందజేశారు.


