News April 2, 2025

నాగర్‌కర్నూల్: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ

image

రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో CM రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా NGKLలో సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. పేద ప్రజల ఆకలి తీరేలా కృషి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Similar News

News December 1, 2025

నేడు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు

image

నేడు ఏకాదశి. ఈ పవిత్ర దినాన కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. దేవుడి స్మరణలో కాలం గడపాలి. వీలైతే నదీ స్నానం, లేకపోతే నదీజలం కలిసిన నీటితో స్నానం చేయాలి. ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. వైష్ణవాలయానికి వెళ్లాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన దీక్ష విరమించాలి. ఫలితంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.’

News December 1, 2025

ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

image

సూర్యుడు ఉత్తర నక్షత్రంలోకి సెప్టెంబర్ మొదటి వారంలో, హస్త నక్షత్రంలోకి సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ తొలి వారంలో ప్రవేశిస్తాడు. సాధారణంగా SEPT, OCT నెలల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ వర్షాలు వరి పంటకు, ఇతర ఖరీఫ్ పంటలకు చాలా కీలకం. అందుకే ‘ఉత్తర, హస్త నక్షత్రాలలో వర్షాలు కురవడం ఖాయం, అవి కురిస్తేనే పంటలకు నీరు పుష్కలంగా లభిస్తుంది” అనే అర్థంలో ఈ సామెతను పూర్వీకులు ఉపయోగించేవారు.

News December 1, 2025

గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్

image

SAతో తొలి వన్డేలో IND గెలుపు అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్ జరగడం కెమెరా కంట పడింది. 11కే 3 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి దాదాపు మ్యాచ్ గెలిచేంతలా SA జట్టు ఎలా కమ్‌బ్యాక్ చేసిందనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. మిగిలిన 2 వన్డేల్లో ఆ జట్టును ఎలా కట్టడి చేయాలి, బౌలింగ్‌లో చేసిన తప్పులపై మాట్లాడినట్లు సమాచారం. వీళ్లిద్దరి డిస్కషన్ గురించి మీరేమనుకుంటున్నారు?