News April 2, 2025
నాగర్కర్నూల్: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ

రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో CM రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా NGKLలో సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. పేద ప్రజల ఆకలి తీరేలా కృషి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Similar News
News November 12, 2025
SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

<
News November 12, 2025
సూర్యాపేట: బయటపడ్డ కాకతీయ కాలం నాటి శివలింగం

తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.
News November 12, 2025
మొంథా తుఫాన్ నష్టం.. ఉమ్మడి జిల్లాకు నిధుల విడుదల

మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 30న కురిసిన వర్షాలతో వరంగల్, హనుమకొండ నగరాలు జలమయమయ్యాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలు సందర్శించి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం రూ.12.68 కోట్లు విడుదల చేసింది. పత్తి, వరి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతినగా, రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.


