News March 19, 2025
నాగర్కర్నూల్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ప్రారంభం

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణుల కోసం మెరుగైన సేవలు అందించేందుకు, సాధారణ ప్రసవాలు చేసేందుకు, అధునాతన హైడ్రాలిక్ టేబుల్స్ వినియోగించేందుకు ఆసుపత్రిలో లేబర్ రూమ్లో అధునాత పరికరాలను ప్రారంభించామని సూపరింటెండెంట్ ఆర్.రఘు తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని సూచించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

సంగారెడ్డిలో 3 రోజులుగా జరిగిన SGF రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు అద్భుత ప్రదర్శనతో ద్వితీయ స్థానం(రన్నరప్) సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం-HYD జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు 6 పరుగుల స్వల్ప తేడాతో HYD జట్టు విజయం సాధించింది. ఖమ్మం జట్టు ప్రతిభావంతమైన ఆటతీరుతో రన్నరప్గా నిలవడంతో, జిల్లా క్రీడాకారులు, కోచ్లు అభినందనలు అందుకున్నారు.
News November 28, 2025
వేములవాడ TO అరుణాచలం RTC స్పెషల్ ప్యాకేజ్

వేములవాడ- అరుణాచలానికి RTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. DEC 6న ఉదయం వేములవాడలో బస్సు బయలుదేరి 7న కాణిపాకం, కంచి, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అదే రాత్రి అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు. 8న అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం బయలుదేరి 9న జోగులాంబ దర్శనం అనంతరం బస్సు వేములవాడకు తిరిగి వస్తుందన్నారు. పెద్దలకు రూ.5,100, పిల్లలకు రూ.3,850లను టికెట్ ఛార్జీలుగా నిర్ణయించారు.
News November 28, 2025
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.


