News April 5, 2025
నాగర్కర్నూల్: ‘మా జీతాలు మాకివ్వండి’

పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణమ్మ, రాధ, బాలమణి, రేణుక, సంతోష, లక్ష్మి, శ్రీదేవి ఉన్నారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: రేపే చివరి అవకాశం

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.
News July 11, 2025
అరుణాచలంలో మోత్కూర్ వ్యక్తి దారుణ హత్య

మోత్కూర్లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ అరుణాచలంలో దారుణ హత్యకు గురయ్యారు. గురువారం దుండగులు ఈజీ మనీ కోసం అతని మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపు విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఇందిరానగర్ కాలనీలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ దుర్మార్గానికి తలపడ్డవారిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
News July 11, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹600 పెరిగి ₹99,000కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹550 పెరిగి ₹90,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 ఎగబాకి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.