News March 20, 2025
నాగర్కర్నూల్: ముగిసిన ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి పరీక్షలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం 5,996 మంది విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి జి.వెంకటరమణ తెలిపారు. గురువారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. దీంతో బస్టాండ్లు విద్యార్థులతో కిక్కిరిశాయి.
Similar News
News December 12, 2025
డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు: అశ్వినీ వైష్ణవ్

2027 జనగణన నిర్వహణకు ₹11,718 కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని జనాభా లెక్కల సమాచారం ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2027 జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయన్నారు. 2దశల్లో జనాభా లెక్కలు నిర్వహిస్తారని వివరించారు. ముందు గృహాల గణన, జాబితా తయారీ, ఆపై జనగణన ఉంటుందన్నారు.
News December 12, 2025
గ్రామ పంచాయితీ ఎన్నికలు: పోలింగ్ సిబ్బందికి దిశానిర్దేశం

కామారెడ్డి జిల్లాలో ఈ నెల 14న జరగనున్న రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బందికి జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సామాగ్రిని తనిఖీ చేసి, పోలింగ్కు ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలి. పోలింగ్ శాతం వివరాలను ఎప్పటికప్పుడు పంపాలి.
పోలింగ్ అనంతరం సిబ్బందిని సురక్షితంగా తరలించాలని సూచించారు.
News December 12, 2025
విష్ణువు మన కోర్కెలు ఎలా తీరుస్తాడు?

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||
పరమాత్ముడైన విష్ణుమూర్తి దీప్తిమంతుడు. ప్రకాశవంతుడు. ఆయన సహనశీలి. సృష్టిలో మొదటగా జన్మించింది ఆయనే. పాప రహితుడు, అనఘుడు, విజయాన్ని సైతం జయించేవాడు కూడా ఆయనే. ఇంతటి గొప్ప భగవంతుడైన ఆ దశావతార మూర్తికి మన కోర్కెలు తీర్చడం అసాధ్యమే కాదు. అందుకే ఆయనను ధ్యానిస్తే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


