News April 16, 2025
నాగర్కర్నూల్: యాక్సిడెంట్లో చనిపోయింది వీళ్లే..!

నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
VJA: దుర్గమ్మ దర్శనానికి దసరా మొబైల్ యాప్, చాట్బాట్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మొబైల్ యాప్, చాట్బాట్లను దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ EO శీనా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవలు భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా ‘దసరా 2025’ పేరుతో యాప్, 9441820717 నంబర్తో చాట్బాట్ అందుబాటులోకి వచ్చాయి.
News September 15, 2025
కొడంగల్: సీఎం ఇలాకాలో సిమెంట్ ఫ్యాక్టరీ..!

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మండలంలోని ధర్మాపూర్ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సున్నపు నిక్షేపాలు వెలికి తీసేందుకు డ్రిల్లింగ్ చేసి ల్యాబ్కు పంపించారు. ధర్మాపూర్, టేకుల్ కోడ్, గండ్లెపల్లి, ఇందనూర్ పరిసర ప్రాంతాల్లోని ఫారెస్టు, ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మూడు వేల ఎకరాల్లో సిమెంట్ తయారీకి అవసరమయ్యే నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు.
News September 15, 2025
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. మంచు మనోజ్ కీ రోల్ చేయగా, రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. తొలి రోజు రూ.27.2 కోట్లు రాగా, రెండో రోజు రూ.28.4కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వచ్చాయి.