News August 9, 2024

నాగర్‌కర్నూల్ యువకుడికి 5 GOVT JOBS

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు పోటీ పరీక్షల్లో సత్తాచాడు. ఒకే ప్రయత్నంలో ఏకంగా 5 ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థుల అభినందనలు పొందాడు. అతడే బిజినేపల్లి మండలానికి చెందిన మాకం ఆంజనేయులు లావణ్య దంపతుల కొడుకు జీవన్ కుమార్. జీవన్ 3 గెజిటెడ్ ఉద్యోగాలు AEE, AE, PLతోపాటు గ్రూప్-4, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం(SSC JE) సాధించాడు. AEE ఉద్యోగంలో చేరుతానని జీవన్ అన్నారు.

Similar News

News October 24, 2025

దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్య

image

దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు(40) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. మైబు హమాలి పని ముగించుకొని గురువారం రాత్రి 9:30 గంటలకు బైక్ పై ఇంటికి వెళ్తుండగా అడవి అజిలాపూర్ గేటు సమీపంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News October 24, 2025

పాలమూరు: టపాసులు పేలి విద్యార్థులకు గాయాలు

image

టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. పాలమూరు రూరల్ రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. అవి పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.

News October 23, 2025

MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.