News March 29, 2025

నాగర్‌కర్నూల్: రేషన్‌కార్డు దారులకు శుభవార్త

image

ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 9, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్‌లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.

News November 9, 2025

చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

image

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.

News November 9, 2025

వనపర్తి: ర్యాగింగ్ పై నిఘా.. SP WARNING

image

వనపర్తి జిల్లా కేంద్రం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలిసిన, చూసిన వారు యాంటీ ర్యాగింగ్ కమిటీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు, కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సూచించారు.