News March 25, 2025
నాగర్కర్నూల్: సర్వే డబ్బులు చెల్లించాలని ఉపాధ్యాయుల వినతి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్కు యూటీఎఫ్ నాయకులు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. కుల గణన సర్వే డబ్బులు వెంటనే ఇవ్వాలని, పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.కృష్ణ, డాక్టర్ శ్రీధర్ శర్మ, ఉపాధ్యక్షుడు సి.తిరుపతయ్య, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు కుర్మయ్య, సోషల్ మీడియా కన్వీనర్ నెహ్రూ ప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


