News April 11, 2025

నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

image

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News November 29, 2025

VKB: ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: DMHO

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె సూచించారు.

News November 29, 2025

VKB: ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: DMHO

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె సూచించారు.

News November 29, 2025

రాజమండ్రి: గోదావరి బాలోత్సవానికి సర్వం సిద్ధం

image

రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న గోదావరి బాలోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి, గోదావరి బాలోత్సవం ఛైర్మన్ దుర్గేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఈఓ కె. వాసుదేవరావు అతిథులుగా పాల్గొంటారు. జిల్లాలోని 145 పాఠశాలల నుంచి 8 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.