News April 11, 2025

నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

image

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్‌కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.

News October 17, 2025

NLG: రైతులకు.. పత్తి వ్యాపారులే దిక్కు!

image

నల్గొండ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడులు ప్రారంభమై 10 రోజులు దాటినా కొనుగోళ్లు లేకపోవడంతో పత్తిని గ్రామంలో ఆరు బయట నిల్వ ఉంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 45 లక్షల క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో గత్యంతరం లేక వ్యాపారులకే రైతులు పత్తి అమ్ముతున్నారు.

News October 17, 2025

రామప్ప ‘ప్రసాద్’ పనులు అటకెక్కినట్లేనా?

image

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో చేర్చింది. సుమారు రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు 2022లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. కాగా పార్కింగ్ స్థలం, సీసీ కెమెరాలు ఏర్పాటు, ఆలయం వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల రూపకల్పన పనులు ఇంకా ప్రారంభం కాలేదు.