News April 15, 2025
నాగర్కర్నూల్: 1,34,503 జవాబు పత్రాల మూల్యాంకనం: డీఈవో

NGKL జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈవో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,34,503 ప్రశ్నాపత్రాలను పారదర్శకంగా మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి పంపామని అన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 130 స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. పాల్గొన్న ఉపాధ్యాయులను డీఈవో సన్మానించారు.
Similar News
News November 28, 2025
NLG: తొలిరోజు భారీగా నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 775 మంది నామినేషన్లు దాఖలు చేయగా వార్డు మెంబర్లకు 384 మంది నామినేషన్లు వేశారు. NLG జిల్లాలో మొత్తం 318 జీపీలకు 363 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. SRPT జిల్లాలో 207 మంది, యాదాద్రి జిల్లాలో 205 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
News November 28, 2025
పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్ స్కిల్స్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్స్చర్నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.
News November 28, 2025
WPL-2026కు ఆదోని క్రికెటర్ దూరం

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి, మోకాలి సర్జరీ కారణంగా WPL-2026 సీజన్కు దూరమయ్యారు. గత మూడు సీజన్లలో యూపీ వారియర్స్కు ప్రాతినిథ్యం వహించిన శర్వాణి, గాయాలతో 8 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ఆమె తండ్రి రమణారావు Way2Newsతో చెప్పారు. వచ్చే జనవరి నుంచి ఆంధ్ర జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు.


