News April 15, 2025

నాగర్‌కర్నూల్: 1,34,503 జవాబు పత్రాల మూల్యాంకనం: డీఈవో 

image

NGKL జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈవో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,34,503 ప్రశ్నాపత్రాలను పారదర్శకంగా మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి పంపామని అన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 130 స్పెషల్ అసిస్టెంట్‌లు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. పాల్గొన్న ఉపాధ్యాయులను డీఈవో సన్మానించారు.

Similar News

News December 7, 2025

ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు: కలెక్టర్

image

పిల్లల పఠన సామర్థ్యం పెంపుకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లతో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం పై ఉపాధ్యాయులు అందించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం కార్యచరణ సిద్ధం చేశామని పేర్కొన్నారు.

News December 7, 2025

ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు: కలెక్టర్

image

పిల్లల పఠన సామర్థ్యం పెంపుకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లతో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం పై ఉపాధ్యాయులు అందించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం కార్యచరణ సిద్ధం చేశామని పేర్కొన్నారు.

News December 7, 2025

చర్లపల్లి స్టేషన్‌లో రూ.91.92 కోట్లతో భారీ ప్రాజెక్ట్!

image

చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు భాగ అభివృద్ధి, ప్రవేశమార్గాల కోసం TSIIC Rs 91.91 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. లెఫ్ట్/రైట్ వింగ్ అమేనిటీ భవనాలు, 2×11.5మీ. క్యారేజ్‌వే రోడ్లు, సర్వీస్ రోడ్లు, 11kV సబ్-స్టేషన్, 1500KVA DG సెట్, 1250KVA ట్రాన్స్‌ఫార్మర్‌లు, 250 KLD వాటర్ ట్యాంక్, 500 KLD STP, ల్యాండ్‌స్కేపింగ్‌తో సహా ఈ ప్రాజెక్టు చర్లపల్లిని కీలక రవాణా కేంద్రంగా మార్చనుంది.