News April 16, 2025
నాగర్కర్నూల్: 23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఈనెల 20వ తేదీలోపు CCE మార్క్స్ ఎంట్రీ పూర్తి చేయాలని జిల్లా DEO రమేశ్ కుమార్ తెలియజేశారు. ఈనెల 21న విద్యార్థుల ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని, తరువాత వాటిని క్రాస్ చెక్ చేసి 23వ తేదీ రోజు జరిగే MEGA Parent Teacher Meetingలో తల్లిదండ్రుల సమక్షంలో ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్స్ విద్యార్థులకు అందజేయాలని సూచించారు.
Similar News
News November 24, 2025
MDK: స్థానిక పోరుకు సిద్ధమా..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పూర్తి చేశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేఫథ్యంలో పల్లెల్లో రాజకీయం వెడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నచోట పోటీకి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు అనుకూలం లేనిచోట అనుచరులను బరిలో నిలిపి స్థానికంగా పట్టు నిలుపుకోవాలని నాయకులు భావిస్తున్నారు. మెదక్లో 223 సర్పంచ్, 1,810 వార్డులను మహిళలకు కేటాయించారు.
News November 24, 2025
అన్నమయ్య: పక్కా ఇల్లు.. 6రోజులే గడువు

గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. స్థలం ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. స్థలం లేనివాళ్లకు 3సెంట్లు కేటాయించి ఇల్లు మంజూరు చేస్తారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాళ్లు సైతం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు చేస్తారు.
News November 24, 2025
భీమవరం: 3,000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


