News April 16, 2025
నాగర్కర్నూల్: 23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఈనెల 20వ తేదీలోపు CCE మార్క్స్ ఎంట్రీ పూర్తి చేయాలని జిల్లా DEO రమేశ్ కుమార్ తెలియజేశారు. ఈనెల 21న విద్యార్థుల ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని, తరువాత వాటిని క్రాస్ చెక్ చేసి 23వ తేదీ రోజు జరిగే MEGA Parent Teacher Meetingలో తల్లిదండ్రుల సమక్షంలో ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్స్ విద్యార్థులకు అందజేయాలని సూచించారు.
Similar News
News October 28, 2025
CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
News October 28, 2025
134 మంది గర్భిణులు ఆసుపత్రికి తరలింపు: కలెక్టర్

మొంథా తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులు, నిరాశ్రయుల రక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి సూచనల మేరకు 134 మంది గర్భిణులను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 5,407 మందిని 119 పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించామన్నారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
News October 28, 2025
కోనసీమలో విషాదం.. చెట్టు కూలి మహిళ మృతి

తుఫాను ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాకనపాలెంలోని ఓ ఇంటి ఆవరణలో తాటిచెట్టు పడిపోవడంతో గూడపల్లి వీరవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


