News March 26, 2025

నాగర్‌కర్నూల్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా NGKL డీసీసీ చీఫ్‌గా అచ్చంపేట MLA వంశీకృష్ణ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం KVN రెడ్డి, విజయ్ రెడ్డి, హబీబ్, ప్రతాప్ గౌడ్, మరో ఇద్దరు ఆశావహులుగా ఉన్నారు.

Similar News

News December 5, 2025

ఒంటరితనంతో మహిళల్లో తగ్గుతున్న ఆయుష్షు

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో ఒంటరితనం పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా లోన్లీనెస్‌తో బాధపడుతున్న వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మహిళల DNA రక్షణ కవచంలోని కణాలు కుంచించుకుపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, ఇమ్యునిటీ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు.

News December 5, 2025

జిల్లాలో 23,719 PMUY కనెక్షన్లు.. MP ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

image

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో 9.71 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వబడినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్ సభలో వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను తెలియజేశారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ గణాంకాలను అందించారు. ఈ గణాంకాల ప్రకారం, ఏలూరు జిల్లాలో 23,719 ఉచిత కనెక్షన్లు మంజూరు చేయబడ్డాయని వెల్లడించారు.

News December 5, 2025

జగిత్యాల: జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

జగిత్యాల జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌ను వివేకానంద మినీ స్టేడియంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత ప్రారంభించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొన్నారు. ఆటలు విద్యార్థుల్లో ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని లత తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, రాజేష్, చక్రధర్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.