News April 2, 2025

నాగర్ కర్నూల్: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

image

ఆకతాయిల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీస్ షీటీమ్స్‌ను సంప్రదించి వేధింపుల నుంచి విముక్తి పొందాలని యువతులకు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్, షీ టీం బృందాలు పర్యటిస్తూ బస్టాండ్లు, విద్యాసంస్థలు, గ్రామ స్టేజీల్లో నిఘా ఉంచుతామని, మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యమన్నారు.

Similar News

News November 16, 2025

రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్‌లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

News November 16, 2025

వరంగల్: వడ్డీ వ్యాపారుల గిరి గిరి తంతు..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. కానీ నియంత్రణ వ్యవస్థ నిమ్మకునీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది.

News November 16, 2025

మెదక్: ‘బాల్య వివాహం జరిగితే సమాచారం ఇవ్వండి’

image

మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి
హేమ భార్గవి అధికారులు, ప్రజలకు విన్నవించారు. మండల, గ్రామ, తండాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫంక్షన్ హాల్ యజమానులకు, ఫొటోగ్రాఫర్‌లు, బ్యాండ్, పురోహితులు, పాస్టర్లు, ఖాజాలు, ప్రజలు జిల్లాలో ఎక్కడైనా వివాహం నిశ్చయం అవుతున్నట్లు తెలిసిన వెంటనే అమ్మాయికి, అబ్బాయికి వివాహ వయస్సు తెలుకోవాలన్నారు.