News April 2, 2025
నాగర్ కర్నూల్: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

ఆకతాయిల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీస్ షీటీమ్స్ను సంప్రదించి వేధింపుల నుంచి విముక్తి పొందాలని యువతులకు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్, షీ టీం బృందాలు పర్యటిస్తూ బస్టాండ్లు, విద్యాసంస్థలు, గ్రామ స్టేజీల్లో నిఘా ఉంచుతామని, మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యమన్నారు.
Similar News
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.
News December 2, 2025
వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ను నిర్ణయించారు. బ్యాలెట్లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
News December 2, 2025
NGKL: సర్పంచ్ ఎన్నికలు.. బరిలో నిలిచేదేవరో, తప్పుకునేదెవరో..?

NGKL జిల్లాలో దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో నాయకులకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా నివారించేందుకు.. ఒక్కరినే బరిలో దించడానికి, నామినేషన్ల ఉపసంహరణకు నేతలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. రేపటితో తొలి విడతలో బరిలో నిలిచేది ఎవరో తేలనుంది.


