News April 8, 2025
నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News December 13, 2025
జగిత్యాల: ఏం చేశారని విజయోత్సవాలు: విద్యాసాగర్ రావు

ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హాయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి కనబడటం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, దావ వసంత ఉన్నారు.
News December 13, 2025
ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్షాప్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.
News December 13, 2025
కొంతమంది సీడీపీవోలు డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నారు: అశోక్

ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక DRDA మీటింగ్ హాలులో జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హాజరయ్యారు. కొంతమంది సీడీపీవోలు సొంత వాహనాలను ఉపయోగించి బిల్లులు డ్రా చేసుకుంటూ డ్రైవర్ల ఉపాధిపై దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.


