News April 8, 2025

నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

image

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News December 19, 2025

ప్రొద్దుటూరులో నేడు బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13,220.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.12,162.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1,980.00

News December 19, 2025

ADB: ఐటీఐ ముడిసరకు కొనుగోలుకు కొటేషన్ల ఆహ్వానం

image

ఆదిలాబాద్‌, ఉట్నూరు ప్రభుత్వ ఐటీఐ సంస్థలకు అవసరమైన వివిధ వృత్తుల ముడిసరకు సరఫరాకు సీల్డ్‌ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జీఎస్‌టీ గుర్తింపు పొందిన సరఫరాదారులు 5 రోజుల్లోగా ప్రిన్సిపల్‌ కార్యాలయంలోని బాక్సులో కొటేషన్లు అందజేయాలన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం 9866435005 నంబరును సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన సరకు సరఫరా చేసే వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

News December 19, 2025

పల్నాడు: సచివాలయాల్లో ముఖ ఆధారిత హాజరు

image

సచివాలయాల వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జిల్లాలోని సచివాలయ ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, పక్కాగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయానికి కార్యాలయానికి వస్తున్నారా.? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా.? లేదా.? అన్న అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.