News April 8, 2025

నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

image

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News December 22, 2025

ఏ పంటకు ఎన్ని బస్తాల యూరియా ఇస్తారు?

image

TG: వరికి ఎకరానికి రెండున్నర బస్తాలు.. చెరుకు, మిరప, మొక్కజొన్న పంటలకు ఎకరానికి 5 బస్తాల వరకే బుక్ చేసుకోవాలి. అంతకు మించి బుక్ చేసుకునే వీలులేదు. ఒకసారి బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకుంటే బుకింగ్ రద్దు అవుతుంది. 15 రోజుల్లో మళ్లీ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ జిల్లా రైతులు అదే జిల్లాలోనే యూరియా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్క జిల్లాలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు.

News December 22, 2025

మావోలపై తుది పోరు.. బస్తర్‌పై బలగాల గురి!

image

మావోయిస్టులపై కేంద్రం చేపట్టిన ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంది. మార్చి 31 <<18321115>>డెడ్‌లైన్<<>> సమీపిస్తుండటంతో మావోల కంచుకోట దక్షిణ బస్తర్‌(ఛత్తీస్‌గఢ్‌)ను బలగాలు టార్గెట్ చేశాయి. అక్కడ కీలక నేతలు పాపారావు(57), బర్సా దేవా(48)తోపాటు 150 మంది మావోలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. 2025లో బస్తర్‌లో జరిగిన 96 ఎన్‌కౌంటర్లలో 252మంది మావోయిస్టులు, 23మంది భద్రతా సిబ్బంది చనిపోయారు.

News December 22, 2025

ADB: నేడు సర్పంచ్‌ల బాధ్యతల స్వీకరణ!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పంచాయతీలు నేడు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మూడు విడతల ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న కొత్త పాలకవర్గాలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. పంచాయతీ కార్యాలయాలను తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ క్రతువు సాగనుంది. పల్లెల అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.