News March 7, 2025

నాగర్ కర్నూల్: గుర్తు తెలియని మహిళ మృతి

image

బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ శివారులోని కేఎల్ఐ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని గురువారం స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మహిళ ఎవరు? ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Similar News

News March 9, 2025

MBNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌‌కు నిధులు

image

రాష్ట్రంలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి, నారాయణపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, గద్వాల్, జడ్చర్లలో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు.

News March 9, 2025

ఎన్టీఆర్: జిల్లా టీడీపీ నేతలకు ఈసారి మొండిచెయ్యి 

image

MLA కోటాలో MLC స్థానాలకు టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ఆదివారం ఎంపిక చేసింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆరుగురు నాయకులు పదవి ఆశించినప్పటికీ వారికి పదవీయోగం లభించలేదు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును టీడీపీ తమ MLC అభ్యర్థులుగా ఎంపిక చేసింది. కాగా ఒక సీటును బీజేపీకి కేటాయించగా, జనసేన నుంచి ఆ పార్టీ నేత నాగబాబును పవన్..MLC అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

News March 9, 2025

నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర పేరును టీడీపీ ఖరారు చేసింది. ఈయన కావలి నియోజకవర్గం అల్లూరు(M) ఇస్కపల్లిలో జన్మించారు. గతంలో ఆయన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, ఆక్వా అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన సోదరుడు బీద మస్తాన్‌‌రావు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

error: Content is protected !!