News March 2, 2025

నాగర్ కర్నూల్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

image

✓నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహణ.
✓నాగర్ కర్నూల్ జిల్లాలో రేపటి నుండి రంజాన్ మాస ఉపవాస అధ్యక్షులు ప్రారంభం.
✓జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.
✓వంగూరు మండలం కొండారెడ్డిపల్లి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత పదవి విరమణ.
✓ముస్లిం సోదరి సోదరీ మణులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

Similar News

News November 15, 2025

HYD: నేషనల్ ప్రెస్ డే.. జర్నలిస్టులకు ఆహ్వానం..!

image

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నవంబర్ 16న నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ, మీడియా అకాడమీ కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఉదయం 10:30కి జర్నలిస్టులు హాజరవ్వాలని IPR అధికారులు కోరారు. I&PR ప్రత్యేక కమిషనర్ ముఖ్య అతిథిగా, సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్ సహా పలువురు మీడియా ప్రముఖులు పాల్గొంటారు.

News November 15, 2025

దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది: మ‌హేశ్ బాబు

image

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. అంద‌రూ గ‌ర్వప‌డేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళిని. ఇది విడుద‌లైన త‌ర‌వాత దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయ‌మ‌ని నాన్న‌ అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌లు ఎప్పుడూ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు’ అని గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌‌లో మాట్లాడారు.

News November 15, 2025

HYD: హైడ్రాకు హైకోర్టు వార్నింగ్..!

image

హైకోర్టు HYDలో సరస్సుల పనుల సందర్భంగా కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు HYDRAA, కమిషనర్ ఎ.వి.రఘునాథ్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని ప్రశ్నించిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, సరస్సుల సంరక్షణ పేరుతో యాదృచ్ఛిక చర్యలు అనుచితమని వ్యాఖ్యానించారు. ఖానామెట్‌లోని తమ్మిడి కుంట ట్యాంక్ సమీపంలో స్టేటస్ క్వో ఆదేశాల ఉల్లంఘనల పై విచారణ జరుగుతోంది.