News March 11, 2025
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా గొడుగులు, స్కార్ఫ్లు ధరించాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News December 9, 2025
ASF యూత్ కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జ్లు

తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ సంస్థను బలపరచేందుకు జిల్లా వారీగా అధిష్ఠానం కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా రవికాంత్ గౌడ్, సెక్రటరీగా అమ్ముల మధుకర్ యాదవ్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ ప్రకటించింది. యువత చేరిక, బూత్ స్థాయిలో బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది.
News December 9, 2025
‘అఖండ-2’ రిలీజ్తో 17 సినిమాలపై ఎఫెక్ట్!

బాలయ్య ‘అఖండ-2’ సినిమా ఈనెల 12న రిలీజ్కు సిద్ధమవుతోంది. దీంతో ఈ వారాంతంలో 14 కొత్త, 3 రీరిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇవి ఇప్పటికే ప్రమోషన్లు పూర్తిచేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ-2’ చూపించే ప్రభావం దృష్ట్యా విడుదలను పోస్ట్పోన్ చేసుకుంటున్నాయి. ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘డ్రైవ్’ వంటి సినిమాల విడుదలకు బాలయ్య మూవీ పెద్ద సవాలుగా మారింది. దీనిపై మీ కామెంట్?
News December 9, 2025
MHBD: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో తొలి దశ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ శబరీష్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల వ్యయ పరిశీలకులు మధుకర్బాబు, తదితరులు పాల్గొన్నారు.


