News March 20, 2025
నాగర్ కర్నూల్: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డుపై అవగాహన సదస్సు

యూడీఐడీ కార్డుపైగా అవగాహన సదస్సును ఈరోజు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, నిరంజన్, గణేశ్ కుమార్, బాల పీర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు: కలెక్టర్

ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. ఆధార్ రికార్డులు అప్డేట్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా అవకాశాలను పొందగలుగుతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.
News October 22, 2025
కల్వకుర్తి: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

కల్వకుర్తి నియోజకవర్గంలోని గౌరిపల్లి గ్రామానికి చెందిన పసుపుల మల్లేశ్ (27) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా ఐదు రోజుల క్రితం పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.