News February 5, 2025

నాగర్ కర్నూల్: ‘మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు’ 

image

మైనర్లకు ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని, విద్యార్థులు స్కూళ్లలోకి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లొద్దని సీఐ నాగార్జున అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

Similar News

News March 15, 2026

రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

image

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 15, 2026

రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

image

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 15, 2026

జమ్మికుంట మార్కెట్‌ రేపు తిరిగి ప్రారంభం

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.