News March 22, 2025
నాగర్ కర్నూల్: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News December 16, 2025
తిరుప్పావై కీర్తనలు ఆలపించే పద్ధతి

ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను ఆలపిస్తే సుగుణాల భర్త వస్తాడని నమ్ముతారు. అయితే మొత్తం 30 పాశురాలు ఉంటాయి. రోజుకొకటి చొప్పున 30 రోజుల పాటు 30 పాశురాలను ఆలపించాలి. ఉదయాన్నే స్నానమాచరించి లక్ష్మీనారాయణులను పూజించాక ఈ పాశురాలను ఆలపించాలి. గోదాదేవి శ్రీకృష్ణుడిని మేల్కొలపడానికి తన చెలులతో కలిసి వీటిని ఆలపించింది. ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై కీర్తనలే ఆలపిస్తారు.
News December 16, 2025
లంపీస్కిన్ నివారణకు మరో ఆయుర్వేద మందు

ఆయుర్వేద మందుతో <<18552983>>లంపీస్కిన్<<>> నుంచి పశువును కాపాడవచ్చు. రెండు వెల్లులి రెబ్బలు, 10గ్రా. ధనియాలు, 10గ్రా. జీలకర్ర, గుప్పెడు తులసి ఆకులు, 10గ్రా. బిర్యానీ ఆకులు, 10గ్రా. మిరియాలు, 5 తమలపాకులు, రెండు ఉల్లిపాయలు, 10 గ్రా. పసుపు, 10గ్రాముల వాము, గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు వేపాకులు, గుప్పెడు బిల్వపత్రం ఆకులు, 10గ్రాముల బెల్లం తీసుకొని వీటిని మిశ్రమంలాగా చేసి వారం రోజుల పాటు రోజుకు ఒకసారి తినిపించాలి.
News December 16, 2025
ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలో మార్పు

TG: ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల <<18157878>>షెడ్యూల్లో<<>> స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. 4న హోలీ పండుగ ఉంటుందని భావించి షెడ్యూల్లో 3వ తేదీన పరీక్ష ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితాలో 3న హోలీ పండుగ సెలవు ఉంది. దీంతో ఈ మార్పు చేశారు. అటు ఫిబ్రవరి 2 నుంచి 3 విడతల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.


