News March 22, 2025
నాగర్ కర్నూల్: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News December 10, 2025
ఖమ్మం: ఓటు వేయాలంటే.. గుర్తింపు కార్డులే ఆధారం!

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ రేపు జరగనుంది. ఉద్యోగులు పంపిణీ చేసే ఓటరు స్లిప్ను కేవలం సమాచారం కోసమే వినియోగించాలని, అది గుర్తింపు పత్రంగా చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేయడానికి ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్ సహా 18 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని అధికారులు ఓటర్లకు సూచించారు.
News December 10, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in
News December 10, 2025
ADB: ఇంకా కొద్ది గంటలే.. ఆలోచించుకో

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు.. అలాంటి పల్లెలు అభివృద్ధి చెందితినే దేశం ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనుంది. ఓటర్ అన్న నీ వజ్రాయుధాన్ని ఉపయోగించడానికి ఇంకా కొద్దిగా సమయం మిగిలింది. మన కులం.. మన వర్గం.. మన పార్టీ అని ఆలోచించుకోకుండా గ్రామానికి మంచి చేసే వాడిని ఎన్నుకో. దేనికైనా లొంగి చెడుకు ఓటేస్తే నిన్ను పట్టుకొని పీడిస్తాడు.


