News August 27, 2024

నాగర్ కర్నూల్: వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి: ఎస్పీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ మాట్లాడారు. వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, మొదలైన సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే ఏ.పి.కె. ఫైల్స్ లింకులను ఓపెన్ చేయవద్దని ప్రజలను కోరారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులను పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు పోయే ప్రమాదం ఉందన్నారు.

Similar News

News March 15, 2026

బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

image

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.

News March 15, 2026

MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

image

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News March 14, 2026

సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.