News March 25, 2025
నాగలాపురం: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

నాగలాపురం మండలంలోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో చరణ్(23) అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిందితుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 6, 2025
వికారాబాద్: రాజీమార్గం అన్ని విధాలుగా మేలు: జడ్జి

రాజీమార్గంతో లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో నవంబర్ 15న నిర్వహించనున్న లోక్ అదాలత్పై పోలీసులు, న్యాయవాదులతో జడ్జి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు నచ్చజెప్పి భారీగా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News November 6, 2025
గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.
News November 6, 2025
వీరుల రక్తపు ధారలు ప్రవహించిన పల్నాడు

నాటి వీరులు వాడిన ఆయుధాలనే దేవతలుగా పూజించే ఆచారం పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోతురాజుకు పడిగం కట్టి పల్నాటి వీరుల ఉత్సవాలకు పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మినీ మహాభారతంగా, ఆంధ్ర కురుక్షేత్రంగా పిలవబడే పల్నాటి యుద్ధ సన్నివేశాలను ఈ ఉత్సవాలలో నిర్వహిస్తారు.


