News February 21, 2025

నాగారం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

image

ఓ యువతి ప్రియుడి ఇంటి ధర్నా చేసిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. బాధితురాలి వివరాలు.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మల్లెపాక నాగరాజు వెంపటి గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని గురువారం అతడి ఇంటి ముందు బైఠాయించింది. వేరే అమ్మాయిని వివాహం చేసుకుని తనకు ఫొటోలు పంపాడని తనకు న్యాయం చేయాలని కోరింది. 

Similar News

News December 1, 2025

WGL: పంచాయతీల బకాయిలు రూ.99.68 కోట్లు.?

image

మాజీ సర్పంచులు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు కోరగా, ఉమ్మడి WGL జిల్లాలో మాజీ సర్పంచులకు రూ.79.68 కోట్లు, ప్రత్యేకాధికారుల పాలనలో కార్యదర్శులు చేసిన ఖర్చులు రూ.20 కోట్లు ఉండవచ్చని అంచనా. మొత్తం బకాయిలు రూ.99.68 కోట్లకు చేరే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News December 1, 2025

చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

image

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.

News December 1, 2025

HYD: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్‌కు చెందిన సాయి (24) శాంతినగర్‌లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.