News March 20, 2025

నాగార్జునసాగర్‌కు భారీగా కేటాయింపులు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 27, 2025

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం

News October 27, 2025

ALERT.. నల్గొండ జిల్లాపై ‘మొంథా’ ప్రభావం

image

రానున్న 2,3 రోజులు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దన్నారు.

News October 27, 2025

కరూర్ తొక్కిసలాటపై CBI దర్యాప్తు ప్రారంభం

image

TN కరూర్‌ తొక్కిసలాట కేసు దర్యాప్తును CBI అధికారంగా చేపట్టింది. FIRను రీ-రిజిస్టర్ చేసింది. ఇందులో TVK జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సహా పలువురు పేర్లున్నాయని, త్వరలో అరెస్టులు జరగొచ్చని సమాచారం. ఈ కేసును తొలుత SIT దర్యాప్తు చేయగా, CBIకి ఇవ్వాలని TVK సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కేసు దర్యాప్తును ధర్మాసనం CBIకి అప్పగించింది. కాగా బాధిత కుటుంబాలను విజయ్ ఇవాళ <<18105218>>పరామర్శించనున్నారు<<>>.