News December 31, 2024
నాగార్జునసాగర్లో న్యూ ఇయర్ వేడుకలకు సన్నాహాలు

నాగార్జునసాగర్లో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన ఔత్సాహికులతో స్థానిక అతిథి గృహాలన్ని కిటకిటలాడుతున్నాయి. 20 రోజుల క్రితమే విజయవిహార్లోని గదులన్నింటినీ ఐటీ కంపెనీల ఉద్యోగులు, వివిధ క్లబ్బులకు చెందిన వారు ముందస్తుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఆయా అతిథి గృహాలు, హోటళ్లు, రిసార్ట్స్ లలో నేడు, రేపు న్యూఇయర్ వేడుకలను ఉల్లాసంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
Similar News
News September 18, 2025
నల్లగొండ : పత్తి కొనుగోలుకు సన్నాహాలు

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈసారి 5,67,613 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా సుమారు 4,54,090 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 7పత్తి కేంద్రాల కింద 24 పత్తి మిల్లులు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిపై చేయనున్నారు.
News September 18, 2025
ఈనెల 20న నల్గొండలో జాబ్ మేళా

నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 20న ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపిక కాబడిన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.
News September 18, 2025
NLG: పత్తికి క్వింటాకు రూ.8110లు మద్దతు ధర

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచేందుకు అడిషనల్ కలెక్టర్ ఇవాళ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 పత్తి కేంద్రాల కింద 24 సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పత్తికి క్వింటాకు రూ.8110లు మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం కలిగి నాణ్యమైన పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.