News July 26, 2024
నాగార్జునసాగర్ ఎత్తిపోతల పథకానికి రూ.500 కోట్లు

నాగార్జునసాగర్ పరిధిలోని ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దేవరకొండతో పాటు సాగర్ ఎడమ కాలవ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, HNR నియోజకవర్గాలలో సుమారు రూ.3 వేల కోట్లతో గతంలో KCR ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించారు. కానీ నిధులు కేటాయించకపోవడంతో పునాది దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ముందుకు సాగనుంది.
Similar News
News October 3, 2025
NLG: మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు..!

మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నల్గొండ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. 154 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడం లేదు. 26వ తేదీ నుంచి నేటి వరకు 8 దరఖాస్తులే వచ్చాయి. పాత వారితోపాటు కొత్త వ్యక్తులు బరిలో ఉంటారని భావించినప్పటికీ దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.
News October 3, 2025
NLG: నిమ్మకాయల ధర పతనం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిమ్మకాయలకు ధర లేక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా NLG, SRPT జిల్లాలో రైతులు అధికంగా నిమ్మ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఈసారి భారీగా నిమ్మ దిగుబడులు పెరిగాయి. పది రోజుల నుంచి నిమ్మ ధరలు సగానికి సగం పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బస్తా ధర రూ.300లకే మించి రావడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు.
News October 2, 2025
NLG: 6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. 375 కేంద్రాలు!

వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ సంవత్సరం జిల్లాలో 6,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.