News October 24, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే వరద తగ్గడంతో క్రస్టు గేట్లను మూసివేశారు. జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 48,569 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 48,569 క్యూసెక్కులుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 589.50 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గాను ప్రస్తుతం 310 టీఎంసీలుగా ఉందన్నారు.
Similar News
News November 27, 2025
NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.
News November 27, 2025
నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
News November 27, 2025
NLG: మాజీ సైనికుల పిల్లలకు గుడ్ న్యూస్

మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.krb.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682-224820 నంబర్ కు సంప్రదించాలని కోరారు.


