News March 24, 2025
నాగార్జునసాగర్ నేటి సమాచారం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 1, 2025
NLG: 2న SC సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

షెడ్యూల్డ్ కులాల సంఘ ప్రతినిధులతో ఏప్రిల్ 2న నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5న భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News April 1, 2025
NLG: దొడ్డు బియ్యం వేలానికి కసరత్తు!

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 4,65,943 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. కాగా ఎఫ్సీఐ, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే కంపెనీ చేయగా కొంతమేరకు డీలర్ల వద్ద కూడా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని వేలం ద్వారా అమ్మకాలు చేయనున్నారు.
News April 1, 2025
నల్గొండ: రాజీవ్ యువ వికాసం గడువు పెంపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గానూ ఏప్రిల్ 14 వరకు మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మ్యానువల్గా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.