News April 4, 2024
నాగిరెడ్డిపేటలో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

నాగిరెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం వైస్ ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గడంతో సంబరాలు జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ఎంపీపీగా కొనసాగిన వైస్ఎంపీపీ దివిటి రాజ్ దాస్ పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆర్డీవో ప్రభాకర్ సమక్షంలో అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ నాయకులు ఆనందంతో మిఠాయిలు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News October 27, 2025
NZB: లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలవగా ఒక్కో దరఖాస్తుకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. ఎక్సైజ్ DC వి.సోమిరెడ్డి పాల్గొన్నారు.
News October 27, 2025
నిజామాబాద్: మున్సిపల్ కార్మికురాలు మృతి..!

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మున్సిపల్ కార్మికురాలు <<18115068>>నాగమణినికి తీవ్ర గాయాలయిన<<>> విషయం తెలిసిందే. కాగా, ప్రమాదం జరగగానే స్థానికులు, తోటివారు వెంటనే స్పందించి ఆమెను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం నాగమణిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచింది.
News October 27, 2025
NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్లు దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.


