News October 29, 2024
నాగిరెడ్డిపేట్: అనారోగ్యంతో ఉపాధ్యాయుడి మృతి

నాగిరెడ్డిపేట మండలం మాసంపల్లి గ్రామంలో యాదగిరి అనే ఉపాధ్యాయుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. యాదగిరి నాలుగు నెలల క్రితం వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాల్లో ఉద్యోగం సాధించి లింగంపేట మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో విధులు నిర్వహించాడని, ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో గణిత విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో గణిత టీచర్గా విధుల్లో చేరాడన్నారు.
Similar News
News July 6, 2025
NZB: VRకు ఏడుగురు SI

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.
News July 6, 2025
నిజామాబాద్: కళాశాలల మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.3.23 కోట్లు

నిజామాబాద్ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, మంచినీటి వసతి, విద్యుత్తు రిపేర్లు, ఇతర కనీస వసతుల నిమిత్తం రూ.3.23 కోట్లు మంజూరు అయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
News July 5, 2025
NZB: ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, నివేశన స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.