News May 31, 2024

నాగిరెడ్డిపేట్ ఇన్‌ఛార్జ్ ఎంపీపీగా వినీత దుర్గారెడ్డి

image

నాగిరెడ్డిపేట మండల ఇన్‌ఛార్జ్ ఎంపీపీగా టేకులపల్లి వినీత దుర్గారెడ్డి శుక్రవారం ఎంపీడీవో పర్బన్న సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఎంపీపీనీ శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధారబోయిన కృష్ణ, గుర్రాల సిద్దయ్య, లక్ష్మయ్య ఉన్నారు

Similar News

News February 12, 2025

NZB: విచారణ కోసం తీసుకెళ్లారు.. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్

image

విచారణ నిమిత్తం తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన NZBలో కలకలం రేపింది. గూపన్పల్లిలో ఓ డాక్టర్ షెడ్‌లో పని చేస్తున్న బోధన్ మండలం కల్దుర్కికి చెందిన రాజును ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ చోరీ కేసు విషయంలో విచారణ కోసం తీసుకెళ్లినట్లు అతడి భార్య లక్ష్మి తెలిపారు. కాగా అనంతరం అతడు గడ్డి మందు తాగడని, దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 12, 2025

KMR: కోళ్లకు వైరస్.. కట్టడికి అధికారుల చర్యలు

image

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు.

News February 12, 2025

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.

error: Content is protected !!