News February 11, 2025

నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Similar News

News December 11, 2025

పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సరళిని కలెక్టర్ బధావత్ సంతోష్ పరిశీలిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌తో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్న ఓటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News December 11, 2025

కామారెడ్డి జిల్లాలో 19.70 పోలింగ్ నమోదు

image

కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 19.70 శాతం పోలింగ్ నమోదైంది. భిక్కనూర్ 21.22 శాతం, బిబిపేట్ 7.36, దోమకొండ 19.14, కామారెడ్డి, 23.66 మాచారెడ్డి 19.46, పల్వంచ 20.49 రాజంపేట్ 21.02 రామారెడ్డి 22.61, సదాశివనగర్ 20.96, తాడ్వాయి 18.76 శాతం పోలింగ్ నమోదైంది.

News December 11, 2025

జగిత్యాల: తొలి విడత ఎన్నికలు.. 2.20 లక్షల ఓటర్లు

image

జగిత్యాల జిల్లాలోని 6 మండలాల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డులు కలిపి 2,20,147 మంది ఓటర్లు ఉన్నారు. మండలాలవారీగా ఓటర్లు: మేడిపల్లి 24,251, భీమారం 17,577, కథలాపూర్ 37,724, కోరుట్ల 36,866, మెట్‌పల్లి 31,243, ఇబ్రహీంపట్నం 31,383, మల్లాపూర్ 41,103. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్ల రద్దీ కనిపిస్తుండగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.