News February 11, 2025

నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Similar News

News October 25, 2025

కృష్ణా: తుపాన్ హెచ్చరికలు.. 3 రోజులు స్కూల్స్ బంద్

image

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులందరినీ 26వ తేదీ సాయంత్రం లోపు వారి వారి ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 25, 2025

రేపు అచ్చంపేటకు రాష్ట్ర గవర్నర్ రాక

image

నల్లమల అడవుల్లో పేదరికం కారణంగా వివాహాలు చేసుకోలేని 111 మంది చెంచు జంటలకు వనవాసి కళ్యాణ పరిషత్ సామూహిక వివాహాలు నిర్వహించనుంది. ఐతోలు ఆలయ అర్చకులు వెల్దండ హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. పేద చెంచులను ఆదుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

News October 25, 2025

KNR: జీవన్‌రెడ్డిని పక్కన పెట్టారా.? పార్టీలో చర్చ

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని అధిష్టానం దూరం పెడుతున్నట్లుగా ఇటీవల పరిణామాలు సూచిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. డా.సంజయ్‌ని పార్టీలో చేర్చుకునే ముందు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి, లైట్ తీసుకుంటున్నారనే వాదన ఉంది. తన శిష్యుడైన మంత్రి లక్ష్మణ్ వద్ద భవిష్యత్ గురించి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. క్యాడర్ కూడా సంజయ్ వెంట ఉండటంతో జీవన్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.