News April 7, 2024

నాగిరెడ్డిపేట: కుటుంబ కలహలతో వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగిరెడ్డిపేట మండలం బంజర తండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా తండాకు చెందిన ధరావత్ వినోద్‌, అరుణ (32)లకు ముగ్గురు కుమారులున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబీకులు నచ్చచెప్పాలని ప్రయత్నించినా వినకుండా క్షణికావేశంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 30, 2024

NZB: మంత్రి జూపల్లి రాక

image

మంత్రి జూపల్లి ఇవాళ జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు మోర్తాడ్, 11 గంటలకు భీంగల్, ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ భవనాలను ప్రారంభిస్తారని అధికారులు, నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్‌లోని IDOC సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

News September 29, 2024

NZB: చెత్తకాగితాలు పోగు చేసుకునే వ్యక్తి హత్య

image

నిజామాబాద్‌ నగరంలోని మూడో టౌన్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో హత్య జరిగింది. 3వ టౌన్ ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. నవీపేట్‌కు చెందిన గణేశ్ (30) హత్యకు గురైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శనివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లగా చెత్త సేకరించుకొని బ్రతికే వ్యక్తిగా గుర్తించారు. గుర్తుతెలియని వారు మెడకి తాడు బిగించి హత్య చేసినట్లు గుర్తించమన్నారు. కేసు నమోదైంది.

News September 29, 2024

శ్రీ నరేంద్రాచార్య మహరాజ్‌ను దర్శించుకున్న ప్రముఖులు

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి, బంగారపల్లి శివారులో గల తెలంగాణ ఉపపీఠంలో జగద్గురు శ్రీ స్వామి నరేంద్రాచార్య మహరాజ్‌ను శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వ్యక్తిగత కార్యదర్శి శ్రీ బాలాజీ పాటిల్ ఖత్ గావ్ కర్ దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట నాందేడ్ జిల్లా బీజేపీ నాయకులు వెంకట్రావు, పాటిల్ గోజేగావ్కర్, శివరాజ్ పాటిల్ హోటల్కర్, మాధవ్ రావు ఉన్నారు.