News April 7, 2025
నాగులకుంట ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని నాగులకుంట ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని పామ్ ఆయిల్, తోటల పెంపకాన్ని చేపట్టారంటూ సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లో నాగులకుంట రైతులు ఫిర్యాదు చేశారు. గతనెల మార్చి 17న ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవని రైతులు ఆరోపించారు. నాగులకుంటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభికి ప్రజావాణిలో వినతిపత్రం అందించారు.
Similar News
News April 19, 2025
ఉమ్మడి కడప జిల్లాలో దారుణ ఘటన

ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలంలో మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళపై వెంకటరమణ లైంగిక దాడికి యత్నించాడు. బయట ఆడుకుంటున్న పిల్లలు ఇది గమనించి కేకలు వేయగా నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News April 19, 2025
ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్కు చెందిన టెస్లా, స్టార్లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.
News April 19, 2025
మరో గంటలో వర్షం

TG: పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్తే అయినా అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.