News January 30, 2025

నాగోబా ప్రజాదర్బార్‌కు 83 ఏళ్ల చరిత్ర

image

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు.

Similar News

News October 16, 2025

సిద్దిపేటలో హృదయ విదారక ఘటన

image

సిద్దిపేట జిల్లా పుల్లూరులో హృదయ విదారక ఘటన జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలున్నా.. ఆయన మృతదేహాన్ని ఉంచేందుకు సొంతిళ్లు లేకపోయంది. పోచయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న పోచయ్య ఆరోగ్య క్షీణించి చనిపోయారు. పొలం విషయంలో గొడవలు జరుగుతుండగా అంత్యక్రియలకు కొడుకులు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని రైతు వేదికలో ఉంచి గ్రామస్థుల సహకారంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించింది.

News October 16, 2025

కర్నూలుకు బయల్దేరిన ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో కర్నూలుకు బయలుదేరారు. కాసేపట్లో ఓర్వకల్లు వినానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్‌లో సుండిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

News October 16, 2025

టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే కొండేటి ప్రయత్నాలు?

image

పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చేరి ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకోవాలన్నదే ఆయన ప్లాన్ గా సమాచారం. టీడీపీ పెద్దలు చిట్టిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతుండగా.. ఆ పార్టీలోని ఎస్సీ నేతలు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు టీడీపీలో ఎంట్రీ జరిగేనా ? లేదా వేచి చూడాలి.