News January 30, 2025

నాగోబా ప్రజాదర్బార్‌కు 83 ఏళ్ల చరిత్ర

image

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు.

Similar News

News October 19, 2025

కాకినాడ: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం రద్దయిన విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. అలాగే ప్రజలందరీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

News October 19, 2025

తొలి మహిళా సీఎం సుచేతా కృపలాని

image

స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలాని దేశంలోనే తొలి మహిళా CMగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచారు. 1908లో పంజాబ్‌లోని జన్మించిన ఆమె బెనారస్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. 1936లో ప్రొఫెసర్ కృపలానీని మ్యారేజ్ చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభ, శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో UP CMగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

News October 19, 2025

దీపావళి దివ్యకాంతులు అందరికీ ఆనందాన్ని తేవాలి: కలెక్టర్

image

దీపావళి పండుగ సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు కలెక్టర్ మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తేవాలని ఆకాంక్షించారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి సంకేతంగా నిలుస్తుందన్నారు. జీవితమంటే చీకటి వెలుగుల సమన్వయమేనని దీపావళి నేర్పే పాఠమని కలెక్టర్ పేర్కొన్నారు.