News January 30, 2025
నాగోబా ప్రజాదర్బార్కు 83 ఏళ్ల చరిత్ర

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్డార్ఫ్ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్ను నిర్వహిస్తున్నారు.
Similar News
News February 13, 2025
తెలుగు రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోంది: శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం బీరుకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెంచిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS హయాంలో నామమాత్రపు ధర పెంచితే గగ్గోలు పెట్టారన్నారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతం.. నాణ్యతలేని బీర్లు తీసుకువస్తున్నారని తెలిపారు. AP, TGలో ఒకేసారి ధరలు పెంచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోందని ఆరోపించారు.
News February 13, 2025
RCB కెప్టెన్గా రజత్ పాటిదార్?

IPL-2025 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్ను కెప్టెన్గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 13, 2025
రజినీకాంత్పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

రజినీకాంత్పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.